టీఎన్జీఓ యూనియన్ నర్సంపేట తాలూకా డైరీ ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి

జనం సాక్షి,నర్సంపేట

టీఎన్జీఓ యూనియన్ నర్సంపేట తాలూకా డైరీ ని నర్సంపేట తాలూకా అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా నర్సంపేట శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి చేతులమీదుగా ప్రారంభించడం జరిగింది,ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగుల పాత్ర మరువలేనీదని , తెలంగాణ అభివృద్ధికి ఉద్యోగుల కృషి అభినందనీయమని, తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగులను కంటికి రెప్పలా కాపాడుకుంటుందని వారన్నారు. విశిష్ట అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షులు గజ్జల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యల సాధనలో టీఎన్జీవో యూనియన్ ముందుంటుందని నర్సంపేట తాలూకాలో భవన నిర్మాణానికి ఎమ్మెల్యేను సహకరించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శ వేణుగోపాల్, కోశాధికారి పాలకుర్తి సదానందం, ఉపాధ్యక్షులు గద్దల రాజు, సహా కార్యదర్శి రామకృష్ణ, ఆనంద్, శ్రీధర్, వంశీ , నర్సంపట తాలూకా కార్యదర్శి సత్యనారాయణ, నెక్కొండ అధ్యక్షులు శ్యాంసుందర్ ,కార్యదర్శి అస్గర్, ఉపాధ్యక్షులు సంజీవరావు, రాజేశ్వరి గణేష్కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం అధ్యక్షులు సెంకేశీ రాజేశ్, నర్సపేట కోశధికారి శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీ సాయిరాం,అనిత,కుసుమ శివ, వేణు తదితరులు పాల్గొన్నారు