టెక్నాలజీని కూడా జీర్ణించుకోలేక పోతున్నారు: మోడీ
న్యూఢిల్లీ,మే7(జనం సాక్షి): యావత్ ప్రపంచం టెక్నాలజీపై పట్టు సాధించేందుకు కృషి చేస్తుంటే? కొందరు మాత్రం టెక్నాలజీని తప్పుబట్టే పనిలో ఉన్నారని ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈవీఎంలు, ఆధార్ వంటి అంశాలపై కొందరు అనవసర రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ప్రధాని చెప్పారు. నమో యాప్ ద్వారా కర్ణాటకకు చెందిన యువ మోర్చా కార్యకర్తలతో ప్రధాని మోడీ ముచ్చటించారు. స్టార్టప్ ల విషయంలో భారత్ దూసుకుపోతోందని, ముఖ్యంగా బెంగళూరు స్టార్టప్ లు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని ప్రధాని మోడీ ప్రశంసించారు.