ట్రాక్టర్‌ – ఆటో ఢీ : ఒకరు మృతి

కరీంనగర్‌ : రాంనగర్‌లో శుక్రవారం ఇసుక ట్రాక్టర్‌-ఆటో ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ఇకరు అక్కడికక్కడే మృతి చెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే ఈ ఘటనతో ఆగ్రహం చెందిన గ్రామస్థులు ట్రాక్టర్‌ను ధ్వంసం చేశారు.