ట్రాక్ దాటుతుండగా రైలు ఢీకొని వ్యక్తి మృతి
కడప,నవంబర్25( జనంసాక్షి): రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కడప జిల్లా రాజంపేట రైల్వే స్టేషన్లో జరిగింది. తుమ్మల అగ్రహారానికి చెందిన గుడిపాటి రవి(29) కూలిపని చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఉదయం అతను సైకిల్పై రైలు పట్టాలు దాటుతుండగా సంపర్క్ క్రాంతి రైలు ఢీకొట్టింది. దీంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. వెంటనే రైల్వే పోలీసులు శవాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్మార్టానికి పంపారు.