ట్రాఫిక్ పోలీసుల వాహన తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడిపిన 03,ముగ్గురికి 6,000 జరిమానా.

.

 మద్యం సేవించి వాహనం నడిపిన వ్యక్తి అనుబంబు కంటే డేంజరస్
– సిద్దిపేట ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ యం.రామకృష్ణ
సిద్దిపేట బ్యూరో 06, జూలై ( జనం సాక్షి )
సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ఎస్ఐ షకీల్ హైమద్, సిబ్బందితో గత 2, 3 రోజుల నుండి సిద్దిపేట పట్టణంలో నర్సాపూర్ చౌరస్తా, ఎంపీడీవో ఆఫీస్ చౌరస్తా,  చౌరస్తాలలో మరియు రాజీవ్ రహదారిపై  వాహనాలు తనిఖీ చేయగా, 3 ముగ్గురు మద్యం సేవించి  వాహనాలు నడుపుతుండగా పట్టుకొని బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా మద్యం సేవించి ఉన్నారని రిపోర్టు రాగా సిద్దిపేట ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి  శ్రీ. రమేష్ బాబు ముందు హాజరుపరచగా విచారణ చేసి 03 ముగ్గురికి  6,000/-వేల రూపాయల జరిమాన విధించారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ సిఐ రామకృష్ణ మాట్లాడుతూ మద్యం సేవించి వాహనాలు నడవదని, మరియు రోడ్డు నిబంధనలు, ట్రాఫిక్ నిబంధనలు పాటించే వాహనాలు నడపాలని, రోడ్డు ప్రమాదాల నివారణ గురించి మాత్రమే ప్రతిరోజు డ్రంక్ అండ్  డ్రైవ్ టెస్ట్ నిర్వహించడం జరుగుతుందన్నారు.

 

తాజావార్తలు