డబల్ బెడ్ రూమ్ లబ్ధిదారులకు పట్టాల పంపిణీ.

సిరిసిల్ల. అక్టోబర్ 13. (జనం సాక్షి). సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 34 వ వార్డులో డబల్ బెడ్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ జరిగింది. స్థానిక కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ ఆధ్వర్యంలో గురువారం మున్సిపల్ చైర్ పర్సన్ జిందం కళ చక్రపాణి చేతుల మీదుగా పట్టాలు పంపిణీ చేశారు. లబ్ధిదారుల పక్షాన కౌన్సిలర్ దార్ల కీర్తన సందీప్ మున్సిపల్ చైర్ పర్సన్ అధికారులకు మంత్రి కేటీఆర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ మంచే శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, టిఆర్ఎస్ నాయకులు దార్ల సందీప్ లబ్ధిదారులు పాల్గొన్నారు