డిగ్రీ అడ్మిషన్లు వాయిదా

అమరావతి,,నవంబర్‌7(జ‌నంసాక్షి): డిగ్రీ ఆన్‌లైన్‌ అడ్మిషన్‌ నోటిఫికేషన్‌ వాయిదా పడింది. శనివారం నోటిఫికేషన్‌ విడుదల చేయడానికి ఏర్పాట్లు చేసినప్పటికీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ ఫీజులను ఇంతవరకు నిర్ణయించకపోవడంతో నోటిఫికేషన్‌ వాయిదా అనివార్యమైంది. మరో రెండు రోజుల్లో నోటిఫికేషన్‌ విడుదల కానుందని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ కె.హేమచంద్రారెడ్డి చెప్పారు.