డిసెంబర్ నెలకు ఆర్జిత సేవా టిక్కెట్లు విడుదల
తిరుమల,సెప్టెంబర్6 (జనం సాక్షి ) : తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆర్జిత సేవా టికెట్లను ఆన్లైన్లో విడుదల చేసింది. డిసెంబర్ నెలకు సంబంధించి 68,466 టికెట్లు విడుదల చేసినట్లు టీటీడీ ఈవో వెల్లడించారు. ఎలక్టాన్రిక్ లాటరీ విధానం కింద 6,516 సేవా టికెట్లు, సుప్రభాతం 3856, తోమాల 60, అర్చన 60, అష్టదళ పాదపద్మారాధన 240, నిజపాద దర్శనం కోసం 2300 టికెట్లను విడుదల చేశారు. కరెంట్ బుకింగ్ కింద మరో 61,950 ఆర్జిత సేవా టికెట్లు విడుదలయ్యాయి. విశేష పూజకు 2500, కల్యాణోత్సవం 13,775, ఊంజల్ సేవ 4350, ఆర్జిత బ్ర¬్మత్సవం 7975, వసంతోత్సవం 15,950, సహస్ర దీపాలంకరణ కోసం 17400 టికెట్లను టీటీడీ విడుదల చేసింది.