డీజే లకు అనుమతి లేదు.. ఎస్సై కోగిల తిరుపతి

సముద్రం-జనం సాక్షి : గణపతి ఉత్సవాల్లో డీజే లకు అనుమతి లేదని స్థానిక ఎస్సై కోగిల తిరుపతి తెలియజేశారు.నిబంధనలు ఉల్లంఘించి డీజే లు పెట్టిన వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.వినాయక శోభయాత్రను అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుతంగా జరుపుకోవాలని తెలిపారు.ఎస్సై తిరుపతి ఆధ్వర్యంలో డీజే యజమానులను తహసిల్దార్ నరేష్ ఎదుట బైండోవర్ చేశారు.