ఢిల్లీలో భర్త ఎదుటే భార్య కాల్చివేత

న్యూఢిల్లీ: దక్షిణ ఢిల్లీలోని సరయి కలేఖాన్‌ ప్రాంతంలో భర్త ఎదుటే ఓ మహిళ (25)ను దుండగుడు కాల్చిచంపాడు. పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి తుపాకీ, బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు, వివరాలు ఇలా ఉన్నాయి. ఢిల్లీలోని భజన్‌పురా ప్రాంతానికి చెందిన మహిళ తన భర్తతో కలిసి కలేఖాన్‌ ప్రాంతానికి వచ్చింది. నిన్న రాత్రి 8 గంటల ప్రాంతంలో దుండగుడు ఆమెపై కాల్పులు జరిపాడు. వెంటనే అక్కడ ఉన్న ట్రాఫిక్‌ పోలీసులు నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. నిందితున్ని బీహార్‌లోని సహర్షకు చెందిన మున్షియా  దవ్‌గా గుర్తించారు. కాల్పులు జరిపిన సమయంలో అతను మద్యం మత్తులో ఉన్నాడని పోలీసులు చెప్పారు. నిందితుడు బాధితురాలికి పరిచయస్తుడేనని..వ్యక్తిగత కక్షలతోనే ఈ ఘటనకు పాల్పడి ఉంటాడని ఏసీపీ అజయ్‌ చౌదరి తెలిపారు. ఈ కేసులో భర్తను కూడా విచారించనున్నట్లు వెల్లడించారు.