తలనీలాల ఆదాయం 7.62కోట్లు

తిరుమల,సెప్టెంబర్‌6  (జనం సాక్షి ) :  కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం తిరుమలకు విచ్చేసే భక్తులు భక్తిశ్రద్ధలతో సమర్పించిన తలనీలాల ఈ-వేలం టిటిడి రూ. 7.62 కోట్ల ఆదాయాన్ని గడించింది. ప్రతినెలా మొదటి గురువారం నాడు తలనీలాల ఈ-వేలం జరుగుతున్నది. ఇందులోభాగంగా టిటిడి తిరుమల ప్రత్యేకాధికారి  ఎ.వి.ధర్మారెడ్డి పర్యవేక్షణలో తలనీలాల ఈ వేలం జరిగింది. మొదటి, రెండు, మూడు, నాలుగు, ఐదు, తెల్లవెంట్రుకలు తలనీలాల రకాల ఈ-వేలం నిర్వహించారు. ఈ నెల నిర్వహించిన ఈ-వేలంలో మొత్తం 17,200 కిలోల తలనీలాలు అమ్ముడు పోయాయి. తలనీలాలలో మొదటి రకం, రెండో రకం, మూడో రకం, నాలుగో రకం, ఐదో రకం వాటిని టిటిడి ఈ-వేలంలో పెట్టింది. వీటి ద్వారా ఈ ఆదాయం వచ్చింది.