తుర్కదిన్నె గ్రామంలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎల్లేని సుధాకర్ రావు.

కోడేరు (జనం సాక్షి) ఆగస్టు 28 నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నియోజక వర్గం కోడేరు మండల పరిధిలోని తుర్కదిన్నే గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్త యాదయ్య,కుమారుడు గత రెండు రోజుల క్రితం మరణించారు.విషయం తెలుసుకున్న నాగర్ కర్నూల్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు కొల్లాపూర్ నియోజక వర్గ ఇన్చార్జి ఏల్లేని సుధాకర్ రావు బాధ్యత  కుటుంబాన్ని పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులకు  తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారికి  మనోధైర్యాన్ని కల్పించారు. వారి కుటుంబ సభ్యులకు తన సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని హామీ ఇచ్చారు. పెళ్లయింది సుధాకర్ రావు వెంట భాను, కార్యకర్తలు.ప్రజలు తదీతరులు పాల్గొన్నారు.