తుస్సుమన్న నిర్భయ్‌ క్షిపణి

న్యూఢిల్లీ, మార్చి 12 (జనంసాక్షి):
భారత్‌ తొలిసారిగా పరీక్షించిన క్రూయిజ్‌ మిస్సైల్‌ నిర్భయ్‌ ప్రయోగం విఫలమైంది. మిస్సైల్‌ లక్ష్యమార్గం తప్పి ప్రయాణించడంతో దాన్ని మధ్యలోనే పేల్చివేశారు. నిర్భయ్‌ మిస్సైల్‌ను రూపొందించిన డిఫెన్స్‌ రీసెర్చ్‌ అండ్‌ డెవలవ్‌మెంట్‌ ఆర్గనైజింగ్‌-డిఆర్‌డిఓ మాత్రం తమ ప్రాజెక్టు సగం విజయవంతమైందని, మిగిలిన సగం విషయంలో ఇంకా కృషి చేయాలని పేర్కొంది. ఒడిశాలోని చండీపూర్‌ నుంచి దీన్ని ప్రయోగించారు.