తెరాస ఎమ్మెల్సీ ప్రమాణస్వీకారం

హైదరాబాద్‌ : తెరాస నుంచి శాసనమండలికి ఎన్నికై ముగ్గురు సభ్యులు ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. స్వామిగౌడ్‌, సుధాకర్‌రెడ్డి, మహమూద్‌ అలీలచే మండలి ఛైర్మన్‌ చక్రపాణి ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చారు.