తెలంగాణ ఇవ్వకుంటే నిర్ణ యం ప్రకటిస్తాం : మందా

న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ తెలంగాణ ఇవ్వకుంటే తమ నిర్ణయం ప్రకటిస్తామని ఎంపీ మందా జగన్నాథం అన్నారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్‌ మోసం చేస్తొందని భావన ప్రజల్లో నెలకొని ఉందని మందా అన్నారు. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని మందా అభిప్రాయపడ్డారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ఎంపీలందరం చర్చించి నిర్ణయం తీసుకుంటామని మందా తెలిపారు.