తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషిస్తాం

తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరమ్‌
హైదరాబాద్‌: తెలంగాణ ఉద్యమంలో మహిళా అధ్యాపకుల పాత్రను పెంపొందించడానికి తెలంగాణ లెక్చరర్స్‌ ఫోరమ్‌ సన్నద్ధమవుతుంది. ఇందులో భాగంగా తెలంగాణలోని పది జిల్లాల అధ్యక్షులు, కార్యదర్శుల సమావేశం హైదరాబాద్‌ నారాయణగూడలో జరిగింది. ఈనెల 24న నగరంలో రాష్ట్రస్థాయి మహిళా సదస్సు నిర్వహించనున్నట్లు ఫోరమ్‌ అధ్యక్షులు వెంకటస్వామి తెలిపారు. త్ణతెలంగాణ జేఏసీ తలపెట్టిచ ఛలో అసెంబ్లి కి తమ పూర్తి మద్దతు ఉంటుందని అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు తమ వంతు కృషిని ప్రధాన పాత్రను పోషిస్తామని అన్నారు.