తెలంగాణ గిరిజన సమైక్య రెండవ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయండి

–జిల్లా గిరిజన సమైక్య నాయకులు గూగులోత్ రామచందర్

టేకులపల్లి ,ఆగస్టు 30( జనం సాక్షి ): భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ దాని అనుబంధం తెలంగాణ గిరిజన సమైక్య రెండవ రాష్ట్ర మహాసభలు హైదరాబాద్ హిమాయత్ నగర్ లోని సత్యనారాయణ భవన్ నందు 2022 సెప్టెంబర్ 1వ తేదీన జరగనున్నాయని సిపిఐ పార్టీ జిల్లా నాయకులు గిరిజన సమైక్య ఉపాధ్యక్షుడు గుగ్గులోతు రామ్ చందర్ తెలిపారు. ఈ రాష్ట్ర మహాసభలో భవిష్యత్తులో ప్రజా పోరాటాలు రూపొందించేందుకు జరిగే మహాసభలో దిశా నిర్దేశాలు చేస్తారని అన్నారు. సమైక్య   నిర్ణయాలకు అనుకూలంగా శ్రేణుల సమరశీల పోరాటాలు చేసేందుకు సిద్ధం కావాలని ఆయన పిలుపునిచ్చారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేకత విధానాలపై పోరాటాలు చేసేందుకు ఈ మహాసభలు వేదిక కానున్నాయన్నారు. ఈ మహాసభలో ప్రతినిధులుగా గుగులోత్ శ్రీను, వాసం భద్రయ్య ,బానోతు వీరన్న, తేజావత్తు లక్ష్మణ్ పాల్గొనున్నారు.