తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయానికి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నామకరణం చేయడం సాహస నిర్ణయం

 ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచుల సంఘం మాజీ అధ్యక్షుడు నర్సింహారెడ్డి
మోమిన్ పేట సెప్టెంబర్ 19 జనం సాక్షి
 తెలంగాణ రాష్ట్రంలో నూతనంగా నిర్మించే సచివాలయానికి ముఖ్యమంత్రి కేసీఆర్ అంబేద్కర్ పేరు నామకరణం చేయడం సాహస నిర్ణయం అని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ అధ్యక్షులు చీమలతర గ్రామ సర్పంచ్ ఎన్ నర్సింహారెడ్డి పేర్కొన్నారు ఇటీవల ప్రకృతి భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ కు పుష్పగుచ్చని అందజేసి కృతజ్ఞతలు తెలిపారు దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహస నిర్ణయం ముఖ్యమంత్రి కేసీఆర్ కే సాధ్యమైందని ఆయన అన్నారు దేశ నలుమూలల గర్వించదగ్గ ప్రజా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి వాటిని పకడ్బందీగా అమలు పరుస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు జాతీయ రాజకీయాలు స్వాగతం పలుకుతున్నాయన్న అన్ని రాష్ట్రాల ప్రజలు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉండాలని ఆయన అన్నారు నూతన పార్లమెంట్ భవనానికి కూడా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరును నామకరణం చేయాలని భారత ప్రధాని నరేంద్ర మోడీని ఆయన సూచించారు దేశ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ముఖ్యమంత్రి కేసీఆర్ను ఆయన కోరారు