తెలంగాణ సోషల్ వెల్ఫేర్ జూనియర్ కాలేజీ లెక్చరర్ తిరుమలేశ్వరి మృతి తోటి

సిబ్బంది వేధింపులే కారణం అంటున్న భర్త సంపత్
చెన్నూర్, అక్టోబర్ 16 (జనం సాక్షి); పట్టణంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ కాలేజ్ లెక్చరర్ గా విధులు నిర్వహిస్తున్న చెట్ల తిరుమలేశ్వరి వయస్సు 39 w/0 సంపత్ చెరువులో దూకి ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. మృతురాలి భర్త సంపత్ తెలిపిన వివరాల మేరకు తన భార్య తిరుమలేశ్వరి తోటి ఉపాధ్యాయురాలు ప్రిన్సిపల్ రాజమణి, స్రవంతి ,రేష్మ ,శిరీష మరియు పుష్పలతలు వేధిస్తున్నారని ఎన్నోసార్లు చెబుతూ బాధపడుతూ ఒత్తిడికి లోనై ఉండేదని 16 /10/ 2023 రోజున ఉదయం ఆరు గంటలకు భర్త సంపత్ స్వయంగా స్కూల్లో దింపి వెళ్లి మరల 8 గంటలకు తిరుమలేశ్వరికి ఫోన్ చేయగా తన ఫోన్ను ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ లిఫ్ట్ చేసి తన బ్యాగులో ఫోన్ రింగ్ అవుతుంటే లేపానని బ్యాగు చెరువు కట్ట వద్ద ఉందని తెలపడంతో అక్కడికి వెళ్లి చూడగా తన భార్య అయిన తిరుమలేశ్వరి నీటిలో తేలుతూ కనిపించగా వెంటనే బయటకు తీసి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువెళ్లగా డాక్టర్ అప్పటికే మృతి చెందినట్లు తెలపడం జరిగిందని పోలీసులకు తెలిపారు. అనంతరం ఫోను పరిశీలించగా మృతురాలి వాయిస్ రికార్డ్ తోటి సిబ్బంది వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకున్నట్లు ఉందని తెలిపారు .ఈ మేరకు ఎస్సై ప్రసాద్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.