తొలి రోజు.. డీఎస్సీ ప్రశాంతం

హైదరాబాద్‌, ఆగస్టు 26 (జనంసాక్షి):
రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ స్కూల్‌ అసిస్టెంట్‌, లాంగ్వేజ్‌, పండిట్‌ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ముగిసింది. ఆదివారం ఉదయం జరిగిన ఈ పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 91 శాతం హాజరు నమోదైంది. అత్యధికంగా హాజరైన జిల్లాగా కరీంనగర్‌ నమోదైంది. ఈ జిల్లాలో 93.8శాతం హాజరయ్యారు. అత్యల్పంగా హాజరైన జిల్లాగా కడప జిల్లా చోటుచేసుకుంది. 82.4 శాతం హాజరుతో ఆఖరి స్థానంలో నిలిచింది. ఇదిలా ఉండగా ఆదివారం ఉదయం పది గంటలకు ప్రారంభమైన పరీక్షకు ఆలస్యంగా వచ్చిన వారిని లోపలికి అనుమతించలేదు. దీంతో గొప్ప అవకాశాన్ని పోగొట్టుకున్నామని అభ్యర్థులు వాపోయారు. ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల నుంచి మరో పరీక్ష ప్రారంభమైంది.