థానేలో కుప్పకూలిన బహుళ అంతస్థుల భవనం

1

– తొమ్మిది మంది మృతి

ముంబై, జులై29(జనంసాక్షి):

మహారాష్ట్రలో ఘోరం జరిగింది.  థానె నగరంలో ఓ మూడంతుస్థుల భవనం కుప్పకూలి తొమ్మది మంది దుర్మరణం చెందగా మరికొందరు శిథిలాల కింద ఉన్నట్లు సమాచారం. ఈ ప్రమాదంలో మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం రాత్రి మూడంతస్థుల భవనం కుప్పకూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. సహాయక సిబ్బంది ఇక్కడ శిథిలాల తొలగింపు చేస్తున్నారు.  మరికొంతమంది శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. సహాయక సిబ్బంది అక్కడికి చేరుకుని శిథిలాలను తొలగిస్తున్నారు.  మరో 20 మంది వరకు శిథిలాల కింద చిక్కుకుని ఉండొచ్చని అనుమానిస్తున్నారు. భవన శిథిలాలను తొలగించేందుకు సహాయ సిబ్బందితీవ్రంగా శ్రమిస్తున్నారు. కుప్పకూలిన భవనం నివాసయోగ్యంగా లేదని తాము ముందే హెచ్చరించి నోటీసులు ఇచ్చినట్లు అధికారులు చెబుతున్నారు. శిథితాల తొలగింపు పూర్తయితే ఎంతమంది చనిపోయిందీ తెలుస్తుందని అధికారులు అన్నారు.