దంతేవాడలో మావోయిస్టుల దాడి

ఛత్తీస్ గఢ్ లో మావోయిస్టులు పంజా విసిరారు. దంతెవాడ జిల్లా బచేలి NMDC ప్లాంట్ పై దాడికి పాల్పడ్డారు. ప్లాంట్ కు సంబంధించిన మూడు షావెల్ మిషన్లు, ఒక డ్రిల్ మిషన్, మోటార్ పంప్ ను మావోయిస్టులు తగులబెట్టారు. అనంతరం పారిపోయారు. సమాచారం అందిన వెంటనే ఘటనా ప్రాంతానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేశారు. ఘటనలో సుమారు 100 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది.