దళిత శక్తి ప్రోగ్రాం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ

పానుగల్ నవంబర్08,జనంసాక్షి
మండల కేంద్రంలో మంగళవారం దళిత శక్తి ప్రోగ్రాం (డిఎస్పి) ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించినట్లు మండల కోఆర్డినేటర్ శివ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆది వెంకట్, స్వరాజ పాదయాత్ర బృందసభ్యుడు అశోక్ పాల్గొని మాట్లాడారు. దళిత శక్తి ప్రోగ్రాం ఆవిర్భవించి 13 సంవత్సరాలు అవుతున్నందున మండల కేంద్రంలో జెండా ఆవిష్కరణ చేసినట్లు తెలిపారు. మండల కోఆర్డినేటర్ శివ మాట్లాడుతూ విశారదన్ నాయకత్వంలో బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ ప్రజల జనాభా దామాషా ప్రకారం రాజకీయ,ఆర్థిక,సామాజిక రంగాలలో సమానవాటా సాధించేదిశగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నవంబర్ 9న నిర్వహించే ప్లీనరీ కార్యక్రమానికి మండలం నుండి అధిక సంఖ్యలో నాయకులు పాల్గొని ప్లీనరిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు లక్ష్మణ్,శివ, గోవింద్,అంజి,అశోక్, రామకృష్ణ,సురేందర్ తదితరులు పాల్గొన్నారు.