దావూద్ మా దేశంలో లేడు : పాక్
ఇస్లామాబాద్ ఆగష్టు 28 (జనంసాక్షి):
అథోజగత్తు నేత దావూద్ ఇబ్రహీం పాక్లోనే ఉన్నాడంటూ భారత్ చేస్తున్న ఆరోపణలను పాకిస్థాన్ ఖండించింది. దావూద్ తమ దేశంలో లేడని పాక్ విదేశాంగ కార్యాలయ అధికార ప్రతినిధి ఖాజీ ఖలీలుల్లా గురువారం స్పష్టం చేశారు. గతంలోనూ ఈ విషయాన్ని తాము తెలియజేశామన్నారు. పాక్లో దావూద్ చిరునామాలుగా పేర్కొంటూ ఇటీవల బయటికొచ్చినవాటిలో కొన్నింటిని మీడియా పరిశీలించిందని… అవి తప్పుడు చిరునామాలుగా తేలాయని వివరించారు. న్యూయార్క్లో సెప్టెంబరులో జరగనున్న ఐరాస సర్వసభ్య సమావేశం సందర్భంగా పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్, భారత ప్రధాని నరేంద్ర మోదీ బ’ాటీ అయ్యే ప్రతిపాదనేదీ లేదని పేర్కొన్నారు. భారత్తో సంబంధాల పురోగతిపై ఎప్పటికప్పుడు ఐరాసకు వివరాలు అందజేసేదిశగా ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.