దివంగత పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ అవార్డు

న్యూఢిల్లీ :
సాంస్కృతిక సామరస్యానికిగాను దివంగత సితార్‌ విద్వాంసుడు పండిట్‌ రవిశంకర్‌కు ఠాగూర్‌ తొలి వార్షిక అవార్డు ప్రకటించారు. గురువారం న్యూఢిల్లీలో ఆయన సతీమణి సుఖన్య శంకర్‌కు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఈ అవార్డు ప్రదానం చేశారు. 92 ఏళ్ల సంగీత సామ్రాట్‌ రవిశంకర్‌ గత డిసెంబర్‌ 11న అమెరికాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. రవిశంకర్‌కు ఠాగూర్‌ అవార్డు ప్రకటించడం పట్ల ఆయన భార్య సుకన్య శంకర్‌ హర్షం వ్యక్తం చేశారు. ఆయనకు ఈ అవార్డు రావడం అభినందనీయమని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ పాల్గొన్నారు. అంతకు ముందు రాష్ట్రపతి భవన్‌లో పండిట్‌ రవిశంకర్‌ కుటుంబ సభ్యులకు ఏర్పాటు చేసిన విందులో ప్రణబ్‌ముఖర్జి దంపతులు పాల్గొన్నారు.