దుర్గా మాతకు ప్రత్యేక పూజలు చేసిన మునిసిపల్ చైర్మన్.

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి,సెప్టెంబర్29(జనంసాక్షి):

దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని ఎర్రగడ్డ సర్వోదయ కాలనీలో ప్రతిష్టించిన దుర్గా మాత అమ్మవారికి మునిసిపల్ చైర్మన్ కల్పన భాస్కర్ గౌడ్ గురువారం ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా మహిళలు కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించా రు.అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు.ఈ కార్యక్రమంలో మునిసిపల్ చైర్మన్ తో పాటు మహిళలు,కాలనీ వాసులు,యువక బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.