దేశంలో అరాచక పాలన సాగిస్తున్న బీజేపీ ప్రభుత్వం

ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన సర్కారు
*రైతు మహాసభలను జయప్రదం చేయాలి
సీపీఎం నియోజకవర్గ జనరల్ బాడీ సమావేశంలో జులకంటి
మిర్యాలగూడ, జనం సాక్షి.
దేశం మొత్తంలో బీజేపీ ప్రభుత్వం ఉండేలా మోడీ కుట్ర చేస్తున్నాడని, అరాచక పాలన సాగిస్తున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే జులకంటి రంగా రెడ్డి ఆరోపించారు. అన్ని రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వం ఉండే విధంగా కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. మోడీ, అమిత్ షా లు ఇద్దరు డబుల ఇంజన్ పేరుతో పాలన చేస్తున్నారని, దీనికి మత పరమైన విద్వేషాలు సృష్టించి పబ్బం గడుపుకుంటుంన్నారు. సెంటిమెంట్లతో అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ దాడులకు పాల్పడుతున్నారని చెప్పారు.  అందులో భాగంగానే మంత్రులపై దాడులు జరుగుతున్నాయని అన్నారు. బీజేపీ కి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బలమైన పోరాటాలు చేయాలని చెప్పారు.ఇప్పటికే బీజేపీ వ్యతిరేక పార్టీలు ఉద్యమాలు చేస్తున్నారని దీనికి గతంలో జరిగిన రైతు ఉద్యమలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీజేపీని అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. భవిష్యత్తు లో బీజేపీ కి వ్యతిరేకంగా ఉద్యమాలు చేస్తామని చెప్పారు. ఈ నెల 27 న నల్గొండలో జరిగే రైతు సంఘం భారీ ప్రదర్శన, బహిరంగ సభ నిర్వహిస్తున్నారని అన్ని గ్రామాల నుండి రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు. మహాసభలను జయప్రదం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు డబ్బికార్ మల్లేష్, రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వీరేపల్లి వెంకటేశ్వర్లు, రవి నాయక్, డా.మల్లు గౌతమ్ రెడ్డి, రాగిరెడ్డి మంగా రెడ్డి వరలక్మి, పరశురాములు, సీతారాములు, భవాండ్ల పాండు, శశిథర్ రెడ్డి, వినోద్ నాయక్, రొంది శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు