ధాన్యం కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి

ఐకేపీ సెంటర్ ప్రారంభోత్సవంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్

మునగాల, నవంబర్ 08(జనంసాక్షి): రైతులందరూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను  సద్వినియోగం చేసుకోవాలని  కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. మంగళవారం మునగాల మండలం నేలమర్రి గ్రామంలో ఐకేపీ సెంటర్ ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ మాట్లాడుతూ, రైతులు నాణ్యమైన ధాన్యాన్ని ఐకేపీ సెంటర్ కు తీసుకవచ్చి ప్రభుత్వ మద్దతు ధర పొందాలన్నారు. దళారుల మాటలు నమ్మి రైతులు మొసపోవొద్దని తెలిపారు. రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో విక్రయించి ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల అరవై రూపాయలకు, కామన్ గ్రేడ్ రెండు వేల నలభై రూపాయల మద్దతు ధర రైతులకు అందిచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బిందు నరేందర్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, సొసైటీ చైర్మన్లు తొగరు సీతారాములు, కందిబండ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, టిఆర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, యుగంధర్ రెడ్డి, ఎలక వెంకట్ రెడ్డి, సైదా, ప్రదీప్, నాగిరెడ్డి, వీరు, గ్రామ టిఆర్ఎస్ నాయకులు నర్రా వెంకట్ రెడ్డి, రవీందర్ రెడ్డి, లింగయ్య, కోటి రెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు లచ్చిరెడ్డి, ఎంపీటీసీ రవి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.