నవ్య ఫౌండేషన్ అధ్యర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు ప్రారంభం

మహిళల సాధికారత అభ్యున్నతి తమ లక్ష్యం….. నవ్య ఫౌండేషన్ చైర్మన్ మడుపు శ్రీ రమ్య వేణుగోపాలరావు
రంగారెడ్డి ,ఇబ్రహీంపట్నం,(జనంసాక్షి) :- ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కేంద్రంలోని ఎంబి ఆర్ నగర్లో  నవ్య ఫౌండేషన్ అధ్యర్యంలో కుట్టు మిషన్ శిక్షణ తరగతులు లంచానంగా ప్రారంభమాయ్యాయి.ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన ప్రత్యేక సమావేశంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన మున్సిపల్ చైర్మన్ కప్పరి స్రవంతి చందు మాట్లాడుతూ ఉచితంగా గృహిణిలకు, మహిళలకు కుట్టు మిషన్ శిక్షణ నవ్య ఫౌండేషన్ తరపున ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని,గత ఎన్నో ఏండ్లుగా వివిధ సమాజ సేవ కార్యక్రమాలు చేపట్టిన నవ్య ఫౌండేషన్ కు,అనునిత్యం కష్టపడుతు ఫౌండేషన్ కార్యక్రమలను విజయవంతం జేస్తున్నా చైర్మన్ మడుపు శ్రీరమ్య వేణుగోపాల్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే వందలాది మంది యువతీ,యువకులకు అనేక రంగాల్లో శిక్షణనిచ్చి వివిధ సంస్థల్లో ఉపాధివకాశాలు ఈ ఫౌండేషన్ కల్పించిందని  కొనియాడారు.మున్సిపల్ వైస్ చైర్మన్ ఆకుల యాదగిరి మాట్లాడుతు సమాజ శ్రేయస్సు కోసం పాటుపడుతూ ఎంతోమంది యువత జీవితాలు నవ్య ఫౌండేషన్ తీర్చిదిద్దిందని   అభినందించారు.అనంతరం నవ్య ఫౌండేషన్ చైర్మన్ మడుపు శ్రీరమ్య మాట్లాడుతూ తమ ఫౌండేషన్ నిరంతరం మహిళల అభ్యున్యాతి కోసం పాటుపడుతుందని,మహిళల అభివృద్దే లక్ష్యంగా గత ఎన్నో సంవత్సరాలుగా పని చేస్తూ అనేక రంగాల్లో ఉపాధి కల్పించి ఆర్థికంగా సుస్థిరం చేశామని,యువతకు, నిరుద్యోగులకు,విద్యార్థులకు ఎల్లవేళలా తమ ఫౌండేషన్ సహాయ సహకారాలు అందిస్తుందన్నారు.ఈ కుట్టు మిషన్ శిక్షణ తరగతులకు వందమందికి పైగా అభ్యర్థులు హాజరయ్యారని,రెండు బ్యాచులుగా విభజించి శిక్షణ ఇచ్చి తగిన ఉపాధి కల్పిస్తామన్నారు.ఈ కార్యక్రమంలో నవ్య ఫౌండేషన్ ప్రధాన కార్యదర్శి మడుపు వేణుగోపాల్,బీజేపీ మున్సిపల్ అధ్యక్షులు బూడిద నర్సింహా రెడ్డి,బిఎస్పి రాష్ట్ర నాయకులు కొండ్రు రఘపతి,తెరాస మున్సిపల్ అధ్యక్షులు అల్వల వెంకట్ రెడ్డి,తెరాస సీనియర్ నాయకులు తాళ్ల మహేష్ గౌడ్, కౌన్సిలర్ నల్లబోలు మమత శ్రీనివాస్ రెడ్డి తెరాస వార్డు అధ్యక్షులు గోపిగౌడ్, మహేందర్ ఫౌండేషన్ సిబ్బంది బండ కుమార్,శాంతి,మాదవి, సుజాత,కోటేశ్వరమ్మా, భాగ్యలక్ష్మి మహిళలు తదితరులు పాల్గొన్నారు.