నష్టాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌మార్కెట్లు బుధవారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలో సెన్సెక్స్‌ 101 పాయింట్లకు పైగా నష్టపోయింది. కాసేపటికి స్వల్పంగా పుంజుకొని 62 పాయింట్ల నష్టంతో కొనసాగుతోంది. అటు నిఫ్టీ కూడా 17 పాయింట్ల నష్టంలో ఉంది.