నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై : స్టాక్‌మార్కెట్లు మంగళవారం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ ఉదయం మార్కెట్‌ లాభాలతో ప్రారంభమైనప్పటికీ కొద్దిసేపటికే నష్టాల బాటపట్టింది. ప్రస్తుతం సెన్సెక్స్‌ 32 పాయింట్లకు పైగా నష్టాల్లో కొనసాగుతోంది, నిఫ్టీ 15 పాయింట్లకు పైగా నష్టంలో ట్రేడవుతోంది. ఇన్ఫోసిస్‌, డీఎల్‌ఎఫ్‌, టాటా మోటార్స్‌ షేర్లు నష్టాల్లో కొనసాగుతుండగా… ఎస్‌బీఐ, ఐటీసీ షేర్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 8 పైసలు కోల్పోయి రూ. 67.35ల వద్ద ఉంది.