నాలుగేళ్ల తెలంగాణ గుండెచప్పుడు 

అనేక ఆశలు, ఆశయాలతో, అమరుల త్యాగాలతో పురుడుపోసుకున్న తెలంగాణను అభివృద్థిపథంలో తీసుకెళ్లేందుకు కెసిఆర్‌ నాయకత్వంలోని  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కృషి చేస్తున్నతీరు ఇప్పుడు దేశానికి దిక్సూచి అనేలా ముందుకు సాగుతున్నారు. మరో ఏడాదిలో ఎన్నికలు రానున్నాయి. టిఆర్‌ఎస్‌ కూడా నాలుగేళ్ల పాలనను పూర్తి చేసుకోబోతున్నది. ఈ నాలుగేళ్లలో చేపట్టిన ఆనేక కార్యక్రమాల్లో రైతాంగ సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయాలే విప్లవాత్మకంగా నిలవనున్నారు. రైతులు ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా వ్యవసాయం చేసుకుని బంగారు పంటలు పండించేలా రైతులకు సకల హంగులు సమకూరుస్తున్న తీరు దేశవ్యాప్తంగా ఆకర్శితమవుతోంది. తాజాగా రాష్ట్రంలోని 18 నుంచి 60 ఏళ్ల వయస్సున్న ప్రతి రైతుకు రూ.5 లక్షల జీవితబీమా పథకం నిర్వహణకు అనుమతిస్తూ మంత్రిమండలి తీర్మానించింది.  ఎల్‌ఐసీ ద్వారా దీనిని అమలు చేస్తారు. ప్రతి రైతుకు రూ.2,271 చొప్పున ప్రీమియాన్ని ప్రభుత్వమే చెల్లించి ఈ పథకాన్ని నిర్వహించాలని నిర్ణయించింది. ప్రీమియంకు చెల్లించే మొత్తాన్ని బడ్జెట్‌లో కేటాయిస్తారు. జూన్‌ నుంచి రైతుల నుంచి నామినీ ప్రతిపాదన పత్రాలు సేకరిస్తారు. ఆగస్టు 15 నుంచి బీమా ధ్రువపత్రాలు అందజేస్తారు.
వ్యవసాయరంగం అభివృద్ధి కోసం రైతుబంధు పథకం ప్రారంభించి ఎకరానికి నాలుగువేలు పెట్టుబడి సాయం అందించడంతోపాటు ఆగస్టు నుంచి రైతుబీమా పథకాన్ని అమలు చేయనున్నాన్నారు. ఇవన్నీ ఒక ఎత్తయితే ఈ నాలుగేళ్ల పాలనలో తీసుకున్న నిర్ణయాలను, అమలువుతున్న తీరును ప్రజల్లోకి గట్టిగా తసీఉకుఇన వెళ్లేలా కార్యాచరణకు సిద్దం అవుతున్నారు. ప్రభుత్వం  పరిపాలనా సౌలభ్యం కోసం చేపట్టిన జిల్లాల పునర్విభజన, పింఛన్లు-జీవనభృతి, మైనారిటీ సంక్షేమం, మౌలికవసతుల కల్పన, రైతుబంధు, రైతుబీమా, ప్రాజెక్టుల నిర్మాణం, విద్యావైద్యంపై ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్‌ నాలుగేండ్లుగా అనేక విజయాలు సాధించారు.  పది జిల్లాల తెలంగాణను 31 జిల్లాలుగా విభజిస్తూ కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో పాలన ప్రజలకు చేరువైంది. జిల్లా కేంద్రాలు కూతవేటు దేరంలోకి వచ్చాయి. ఇకపోతే మంచినీటికోసం మిషన్‌ భగీరథ, సాగునీటి కోసం మిషన్‌ కాకతీయ, 24 గంటల విద్యుత్‌ సౌకర్యం వంటివి విజయవంతంగా అమలుచేయడానికి రంగం సిద్దం అయ్యింది.  వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులు, వికలాంగులు ఇలా అందరికీ పింఛన్‌ అందిస్తున్న తీరును కూడా ప్రచారంలో ప్రధానంగా ప్రస్తావించనున్నారు.  ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమపథకాలను ప్రజలకు వివరించడంలో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను సర్వసన్నదం చేయబోతున్నారు.   తెలంగాణలో రైతులకు, ప్రజలకు నమ్మకం భరోసా కల్పించడంలో సీఎం కేసీఆర్‌ విజయం సాధించారనే చెప్పాలి. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలను ఆకర్షిస్తున్నాయని నేతలు పదేపదే అంటున్నారు. కేసీఆర్‌ తీసుకున్న ప్రతి పథకం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తున్నదని, త్వరలోనే జాతీయస్థాయిలో అన్ని పార్టీలకు ఇవే మ్యానిఫెస్టోలు కానున్నాయని తెలిపారు. కరువులేని రాష్ట్రంగా మార్చేందుకు కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టారని తెలిపారు. గత నాలుగేళ్లలో అనేకానేక కార్యక్రమాలు చేపట్టి ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపదించిన గులాబీనేత కెసిఆర్‌ కూడా తన అభివృద్ది మంత్రాన్ని ప్రజలకు వివరించనున్నారు. ఇంతకాలం చేపట్టిన కార్యక్రమాలు, చేసిన పనులు అనేకం ఉన్నా ప్రజల మదిలో ఎక్కడో వెలితి ఉండనే ఉంది. తమకు ఉద్యమ ఫలాలు దక్కలేదన్న బాధ ఉంది. ఈ విషయం సిఎం కెసిఆర్‌ కూడా గుర్తించారు. అందుకే ఈ నాలుగేళ్ల కార్యక్రమాలే కాకుండా త్వరలో తీసుకోబోయే విప్లవాత్మక నిర్ణయాలను వెల్లడించే అవకాశం ఉంది. ప్రధానంగా వ్యవసాయాన్ని పండగచేసి రైతు కళ్లలో
ఆనందం చూస్తానని ప్రకటించారు. అందుకు అనుగుణంగా కార్యక్రమాలను వెల్లడించారు. ప్రధానంగా ఈ నాలుగేడేళ్లలో నిరంతర విద్యుత్‌ అన్నది ప్రధానమైన లక్ష్యాన్ని దాటారు. గతంలో నిరంతర కోతలు తప్ప విద్యుత్‌ ఉండేది కాదు. ఇప్పుడు ఎక్కడా కోతలు అన్న పదానికి తావు లేకుండా చేసిన ఘనత సిఎం కెసిఆర్‌దే. ఇది ఎవరూ కాదనలేని నిజం. మనకు అనుభవంలో ఉన్న సత్యం. పారిశ్రామిక వేత్తలు కూడా దీనిని అంగీకరిస్తున్నారు. ఇక  మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాల అధ్యయనం కోసం ఇక్కడికి వివిధ రాష్ట్రాల అధికారులు వస్తున్నారంటే అవి ఎంతగా ప్రాచుర్యం పొందాయో చెప్పకరలేదు. ఇంటింటికి మంచినీళ్లు ఇవ్వకుంటే ఓట్లడగనని చెప్పిన నేతగా ఇప్పటికే కెసిఆర్‌ చరిత్ర సృష్టించారు. ఈ మేరకు మిషన్‌ భగీరథ పనులు శరవేగంగా సాగుతున్నాయి. అనుకున్న మేరకు ఈ యేడాది చివరికల్లా మంచినీటి నల్లాలు ఇళ్లలోకి రానున్నాయి. సుపరిపాలన దిశగా సుస్థిర పాలన అందించటం క్లిష్టమైనదే కాకుండా కష్టసాధ్యమైనది కూడా. రాష్ట్ర ఏర్పాటుకు పోరాడడం ఒక ఎత్తయితే, సుస్థిరాభివృద్ధికి సుపరిపాలన ఎంతో అవసరం. ఆ దిశగా వేస్తున్న అడుగులు సహజంగానే ఇతరులకు పెద్దగా కనిపించకపోవచ్చు. అవి అడుగులే కాదనే వారు ఉంటారు.కానీ కెసిఆర్‌ మాత్రం ఒక్క అడుగే వేల కిలోవిూటరల్‌ ప్రయాణానికి పునాది అంటారు. అందుకే తాను నమ్ముకున్న బాటలో సాగడానికి ఆయన విమర్శలను పక్కన పెట్టారు. అందుకే అచిర కాలంలోనే దేశానికే ఆదర్శంగా నిలిచే విధంగా అభివృద్ధి సంక్షేమ పథకాల రూపకల్పనలో తనదైన ముద్రను వేశారు. తెలంగాణ అభివృద్ధి పట్ల భవిష్యద్దర్శనం ఉన్న నేతగా కేసీఆర్‌ ప్రవేశపెట్టిన మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పథకాలు ప్రపంచదృష్టిని ఆకర్షిస్తున్నాయి, ఆదర్శంగా నిలుస్తున్నాయి.  ఇతర రాష్ట్రాల ప్రభుత్వ ప్రతినిధులు  ఇక్కడికి వచ్చి పథకాలను పరిశీలించడం అంటే  ప్రజారంజక పాలనకు కేంద్రంగా నిలిచారు.
——————