నాలుగో టెస్టుకు భారత జట్టు ఎంపిక

ముంబయి : భారత్‌- ఇంగ్లాండ్‌ల మధ్య జరుగనున్న నాలుగో టెస్టు మ్యాచ్‌కు భారత్‌ జట్టు ఎంపిక జరిగింది. టీం ఇండియాకు ధోనీ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. టీం ఇండియా జట్టులో మాస్టర్‌బ్లాస్టర్‌ సచిన్‌కు చోటు దక్కింది. ఆయన నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆడేందుకు సెలెక్టర్లు అవకాశమిచ్చారు. సచిన్‌తో పాటు రవీంద్ర జడేజా, చావ్లా, పర్వీందర్‌లకు కూడా జట్టులో ఆడేందుకు అవకాశం దక్కింది. కాగా, జహీర్‌ఖాన్‌ యువరాజ్‌సింగ్‌చ హర్బజన్‌లకు మాత్రం జట్టులో అవకాశం ఇవ్వలేదు. డిసెంబరు 13 నుంచి నాగ్‌పూర్‌లో భారత్‌- ఇంగ్లాండ్‌ల మధ్య నాలుగోటెస్టు మ్యాచ్‌ జరగనున్న విషయం తెలిసిందే.