నిందితుడు చైల్ సింగ్ ను కఠినంగా శిక్షించాలి

జహీరాబాద్ ఆగస్టు 18 జనంసాక్షి
రాజస్థాన్ లోని జాలోర్ జిల్లా సురానా గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల పసిబాలుడు ఇందర్ కుమార్ మేఘ్వాల్ ను కొట్టి చంపిన
మనువాది చైల్ సింగ్ ను అరెస్టు చేసి, చట్టప్రకారం శిక్షించాలని వివిధ దళిత సంఘాల అధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం లో వినతి పత్రం అందజేశారు.,ఈ సందర్భంగా జహీరాబాద్ నియోజకవర్గ ఎమ్మార్పియస్ మాజీ ఇంచార్జ్ అబ్రహాం మాదిగ మాట్లాడుతూ నిందితుడు చైల్ సింగ్ ను ఉరి తీయ్యకపోతే మా సత్తా చూపుతామని ఈ సందర్భంగా హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మాదిగ ఎంప్లాయిస్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షుడు రాంచందర్, కె.శ్రీకాంత్ పద్మశాలి రాష్ట్ర యువత కార్యదర్శి,జె,జైరాజ్ అరుధంతి సంఘం నాయకులు ముస్లిం సంఘం నాయకులు అమీన్, ఎమ్మార్పియస్ నాయకులు జైరాజ్,ఉల్లాస్,నర్సింములు,ప్రేంరాజ్ పాల్గొన్నారు.