నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ గారి ఇంటి పై తెరాస గుండాల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం

బిజెపి జిల్లా అధికార ప్రతినిధి మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు మాట్లాడుతూ,
రాష్ట్రంలో కెసిఆర్ మార్గ నిర్దేశంలో ప్రతిపక్ష నాయకుల ఇళ్లల్లో చొరబడి గుండాలతో దాడులు జరిపించే పరిస్థితి రావడం అత్యంత శోచనీయమని,రాజకీయ విమర్శలకు ప్రతి విమర్శలు చేయాలి కానీ ఇండ్లపైన,ఇంట్లో మనుషుల పైన దాడులు చేయడం, చెప్పుతో కొడతాం, వెంటపడి చంపేస్తాం అంటూ ఎమ్మెల్సీ కవిత దుర్భాషలాడుతున్నారంటే తెలంగాణ ప్రజలకు ఏ విధమైన సందేశాన్ని ఇస్తున్నారు.
కెసిఆర్ కుటుంబ సభ్యులు ప్రధాని లేదా ఎవరినైనా విమర్శించవచ్చు కానీ మీ అరాచకాలను ప్రశ్నిస్తే దాడులు చేస్తారు,వాక్ స్వాతంత్రం అనేది కేవలం  కుటుంబానికి మాత్రమే పరిమితమా,?తెరాస గుండాలను ఉసిగొల్పి ఎంపీ అరవింద్ గారి ఇంటి మీద  చేసిన దాడికి కెసిఆర్ పూర్తి బాధ్యత వహిస్తూ  క్షమాపణలు చెప్పాలని
బిజెపి జిల్లా అధికార ప్రతినిధి జిల్లా మీడియా ఇంచార్జ్ పెద్దిరాజు పేర్కొన్నారు.