నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే… ఇల్లు కూలి 9 మంది మృతి

iy09aov4ఉత్తరప్రదేశ్‌లో ఘోరం జరిగింది. ఓ ఇంటి యజమాని నిర్లక్ష్యం కారణంగా 9 మంది నిద్రిస్తున్న వారు నిద్రిస్తున్నట్లే మరణించారు. బాందా ప్రాంతంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. 
స్థానిక గాంధీనగర్‌ ప్రాంతంలోని ఓ ఇంటి పైకప్పు బుధవారం రాత్రి కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9మంది మృతి చెందగా, మరి కొందరికి గాయాలయ్యాయి. ఇంకా 11 మంది శిధిలాల కింద చిక్కుకున్నట్లు అనుమానిస్తున్నారు. 
క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. స్థానికులతో పాటు జిల్లా అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఇంటి యజమాని నిర్లక్ష్యమేనని ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు.