నిధులు విడుదల చేయండి

3

– కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీకి ఈటల లేఖ

హైదరాబాద్‌,మార్చి26(జనంసాక్షి):వెనుకబడిన జిల్లాల అభివృద్ధికి రూ.450 కోట్ల గ్రాంట్‌ విడుదల చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీకి రాష్ట్ర ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్‌ లేఖ రాశారు. రెండవ విడత స్పెషల్‌ అసిస్టెన్స్‌ గ్రాంట్‌ కింద ఈ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు. ఏపీ విభజన చట్టం 2014 లోని సెక్షన్‌ 94(2) ప్రకారం తెలంగాణ రాష్ట్రానికి నాలుగు సంవత్సరాల కాలానికి 30,571 కోట్ల రూపాయల ఆర్థిక సహాయం కావాలని ఇప్పటికే కేంద్రానికి ప్రతిపాదనలు పంపిన విషయాన్ని మంత్రి ఈ లేఖలో గుర్తు చేశారు. ఈ ఆర్థిక సంవత్సరానికి (2015-16)గాను 1000 కోట్ల రూపాయల గ్రాంట్‌ ను ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రధానమంత్రికి కూడా లేఖ రాసిన విషయాన్ని మరోసారి ప్రస్తావించారు. కానీ, కేంద్రం ఇప్పటి వరకు ఒక్క విడత కేవలం 450 కోట్ల రూపాయల గ్రాంట్‌ ను మాత్రమే విడుదల చేసిందని.. వెంటనే రెండవ విడత గ్రాంట్‌ ను విడుదల చేయాలని మంత్రి ఈటల రాజేందర్‌ ఈ లేఖలో పేర్కొన్నారు.ఏపీకి కేంద్రం ఈ ఆర్థిక సంవత్సరానికే రెండు విడతల గ్రాంట్‌ విడుదల చేసిన విషయాన్ని మంత్రి ఈటల రాజేందర్‌ ఈ సందర్భంగా గుర్తు చేశారు.