నిబంధనల మేరకు నడుచుకోవాలి: కలెక్టర్‌

ఖమ్మం,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): ఖమ్మం జిల్లాలో ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహీంచడానికి రాజకీయ పార్టీలు మిడియా మిత్రులు సహకరించాలని ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కర్ణన్‌ కోరారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో ని టిటిడిసిలో ఎరుపాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎలక్టాన్రిక్‌, ప్రింట్‌ మిడియా యాడ్స్‌ వేసేముందు ఎన్నికల నియమాలను పాటించాలన్నారు. రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం నిర్వహించి నామినేషన్‌ పత్రాలను దాఖలు సంబంధించిన విషయాలను వివరించామన్నారు. ఈసమావేశంలో ఖమ్మం సిపి తప్సిర్‌ ఇక్బాల్‌ పాల్గొన్నారు.