నియోజకవర్గ ప్రచార కమిటి అధ్యక్షుడిగా సెగ్గెం రాజేష్‌

జనంసాక్షి, మంథని, అక్టోబర్ 28 :
మంథని నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రచార కమిటి అధ్యక్షుడిగా సెగ్గెం రాజేష్‌ను నియమిస్తూ భీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు సెగ్గెం రాజేష్‌కు నియామకపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని బీఆర్‌ఎస్‌ పార్టీ శ్రేణులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.