నిర్మల్‌ కోర్టుకు హాజరైన అక్బరుద్దీన్‌

ఆదిలాబాద్‌: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఈ ఉదయం నిర్మల్‌ న్యాయస్థానంలో హాజరయ్యారు. కేసు విచారణను కోర్టు మార్చి 5కు వాయిదా వేసింది. ఈ కేసులో అక్బరుద్దీన్‌ అరెస్టు బెయిల్‌పై విడుదలైన విషయం తెలిసిందే.