నిలబెట్టి గుండు గీశారు…!! ఎక్కడ ?

వారు చేసిన తప్పల్లా ప్రేమించుకోవడం… ఆపై పారిపోవడం… పెద్దలకు చెప్పకుండా పెళ్ళి చేసుకోవాలకున్నారు.. ఇక ఇందులో తప్పేముంది అంటారా… తప్పే ఆ ఊళ్ళు తప్పే.. ఇక అంతే పెద్దలంతా ఒకటై పంచాయితీ పెట్టారు. నిలబెట్టి వారికి గుండు గీశారు. ఇంతకీ ఎక్కడ జరిగిందేంటి? 
ఉత్తరప్రదేశ్లోని వారణాసి సమీపంలో గల కొయిరాజ్పూర్ గ్రామానికి చెందిన ఓ టీనేజి అమ్మాయి 20 ఏళ్ల అబ్బాయి ప్రేమించింది. ఆపై జంట పారిపోయింది. ప్రేమించుకుని పెళ్లి చేసుకోడానికి ఎక్కడికో వెళ్లిపోయిన ఈ జంట.. ఆదివారం నాడు తిరిగి గ్రామానికి వచ్చారు. దాంతో వాళ్లను పట్టుకున్న పెద్దలు.. ఆ ఇద్దరికీ గుండు గీశారు. 
అబ్బాయి కుటుంబ సభ్యులు, అమ్మాయి దూరపు బంధువు ఒకరిని ఈ కేసులో అరెస్టు చేశారు. అయితే.. పంచాయతీ తీర్పు మేరకే వాళ్లను గుండు గీసి ఊరేగించినట్లు స్థానిక మీడియా కథనాలు వెల్లడిస్తున్నాయి.