నూతన ఆసరా పెన్షన్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, డీసీసీబీ చైర్మన్

కుల్కచర్ల,సెప్టెంబర్ 2(జనం సాక్షి):
రాష్ట్రంలోని బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆసరా పథకం ద్వారా కొండంత అండగా సీఎం కేసీఆర్ నిలిచాడని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి మరియు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బండ వెల్కిచర్ల, కుసుమ సముద్రం, ఇప్పాయిపల్లి, రాంపూర్, పుట్టపహాడ్ గ్రామాల్లో ఎంపీపీ సత్యహరిశ్చంద్ర, జెడ్పీటీసీ రాందాస్ నాయక్, మార్కెట్ కమిటీ చైర్మన్ బృంగి హరికృష్ణ, రైతుబంధు మండల అధ్యక్షులు రాజు, ఇతర గ్రామ సర్పంచులు, నాయకులు  మరియు  ప్రజాప్రతినిధులతో కలిసి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి, డీసీసీబీ చైర్మన్ బుయ్యని మనోహర్ రెడ్డి  నూతనంగా మంజూరైన పెన్షన్ కార్డుల లబ్ధిదారులకు ధ్రువపత్రాలను అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా పెన్షన్ ఎక్కువ మొత్తంలో తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలోనే ఇవ్వడం జరుగుతుందని అన్నారు.పేదలకు ఆర్థిక భరోసా కల్పిస్తూ వారి గౌరవాన్ని పెంచిన ఏకైక నాయకుడు కేసీఆర్ మాత్రమేనని అన్నారు.ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు శేరి రాంరెడ్డి, పాంబండ ఆలయ చైర్మన్ గణపురం రాములు, తెరాస మండల ప్రధాన కార్యదర్శి గజ్జి లక్ష్మయ్య, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు,ప్రజలు ఆసరా పెన్షన్ లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.