నూతన మండలానికి సకల హంగులు

గట్టుప్పల్  మండలం లో ప్రభుత్వ కార్యాలయాలు, తహశీల్దార్ కార్యాలయం,పోలీస్ స్టేషన్ లను ప్రారంభించిన రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జి.జగదీశ్ రెడ్డి
నల్గొండ బ్యూరో, జనం సాక్షి .                          జిల్లాలో నూతనంగా ఏర్పాటు చేసిన గట్టుప్పల్ మండలానికి సకల హంగులు కల్పించేలా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి  గుంతకండ్ల  జగదీష్ రెడ్డి  అన్నారు. ఆదివారం  పరిపాలన కార్యాలయం లు తహశీల్దార్ కార్యాలయాన్ని ప్రారంభించారు. అనంతరం గాంధీ జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.తర్వాత పోలీస్ స్టేషన్ ను ప్రారంభించారు.మంత్రి తో పాటు రాజ్య సభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్,ఎం.ఎల్.సి. నర్సి రెడ్డి,మాజీ శాసన సభ్యులు కూసు కుంట్ల ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టి.వినయ్ కృష్ణా రెడ్డి,ఎస్.పి. రెమా రాజేశ్వరి, అదనపు కలెక్టర్ భాస్కర్ రావు,అర్.డి. ఓ జగన్నాథ రావు,స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.
4 Attachments • Scanned by Gmail