నేడు జపాన్‌కు చిదంబరం

న్యూఢీల్లీ : విదేశీ పెట్టుబడిదారులను ఆకర్షించడానికి ఆర్థిక మంత్రి చిదంబరం నేడు జపాన్‌ వెళ్లనున్నారు. ఇప్పటికే
ఆయన సింగపూర్‌, యూరవ్‌లు పర్యటించి అక్కడి పెట్టుబడిదారులకు భారత చేపడుతున్న సంస్కరణలను వెల్లడించారు.పెట్టుబడులకు భరత్‌ మంచి గమ్యస్థానమన్న అభిప్రాయాన్ని కలిగించే ప్రయత్నం చేశారు. మూడు రోజులు సాగే జపాన్‌ అధికార పర్యటనలో జపాన్‌ ఆర్థిక మంత్రి, అక్కడి సంస్థాగత మదుపర్లును చిదంబరం కలుస్తారని అధికార వర్గాలు తెలిపాయి.