నేడు డయల్ యువర్ ఇవో
తిరుమల,సెప్టెంబర్5 (జనం సాక్షి ) తిరుమలలోని అన్నమయ్య భవనంలో ప్రతినెలా మొదటి శుక్రవారం ఉదయం 8.30 గం||ల నుండి ఉదయం 9.30 గంట|ల నడుమ నిర్వహించే డయల్ యువర్ ఈవో కార్యక్రమం సెప్టెంబర్ 6వ తేదీన శుక్రవారం జరుగనుంది. ఈ కార్యక్రమంలో భక్తులు తమ సందేహాలను, సూచనలను టిటిడి కార్యనిర్వహణాధికారి అనిల్కుమార్ సింఘాల్ గారికి ఫోన్ ద్వారా నేరుగా మాట్లాడి తెలుపవచ్చు. ఇందుకు భక్తులు సంప్రదించవలసిన నెంబరు 0877-2263261. కాగా, డిసెంబర్ నెలకు సంబంధించిన శ్రీవారి ఆలయం, టిటిడి స్థానికాలయాల ఆర్జిత సేవా టికెట్లను ఉదయం 10.00 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. శ్రీవారి సేవ నమోదుకు డిసెంబర్ నెల కోటాను కూడా విడుదల చేస్తారు.