నేడు స్వదేశానికి బాధితురాలి మృతదేహం

సింగపూర్‌ : సింగపూర్‌లోని మౌంట్‌ ఎలిజబెత్‌ అసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన అత్యాచార బాధితురాలి మృతదేహాన్ని అధికారులు నేడు భారతదేశానికి తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు అధికారులు తెలిపారు. ప్రత్యేక ఛార్టర్‌ విమానంలో ఆమెను భారత్‌కు తరలించనున్నట్టు సింగపూర్‌లోని భారత హైకమిషనర్‌ రాఘవన్‌ తెలియజేశారు.