నేను ప్రజల మనిషిని..

` నాకు సెక్యూరిటీ అవసరం లేదు
` గన్‌మెన్లను తిరస్కరించిన ఎమ్మెల్సీ కోదండరామ్‌
హైదరాబాద్‌(జనంసాక్షి): ఇటీవల గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన ఆచార్య కోదండరామ్‌.. తనకు కేటాయించిన సెక్యూరిటీని నిరాకరిచారు. తాను ప్రజల మనిషినని, వ్యక్తిగత భద్రతా సిబ్బంది అవసరం లేదని స్పష్టం చేశారు.సెక్యూరిటీ వల్ల ప్రజలతో సత్సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్నారు. ప్రజలు తమ సమస్యలను స్వేచ్ఛగా తనకు తెలియజేసే అవకాశం ఉంటుందన్నారు. భద్రతా సిబ్బంది ఉంటే ప్రజలు తన వద్దకు రాకుండా నిలువరించే ప్రమాదం లేకపోలేదన్నారు.