నేపాల్‌కు అండగా ఉంటాం

2

– ఎంబసీ విజిటర్స్‌ బుక్‌లో రాహుల్‌

న్యూఢిల్లీ,మే1 (జనంసాక్షి):

కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ నేపాల్‌ ఎంబసీ కార్యాలయానికి వెళ్లారు. భూకంపధాటికి అతలాకుతలమైన నేపాల్‌లో ప్రస్తుతం కొనసాగుతున్న సహాయక చర్యల విషయమై ఎంబసీ అధికారులను రాహుల్‌ అడిగి తెలుసుకున్నారు. నేపాల్‌ భాధితులకు భారత ప్రజలంతా అండగా ఉన్నారంటూ ఎంబసీ కార్యాలయంలోని విజిటర్స్‌ బుక్స్‌లో రాశారు. భూకంపంలో ఇప్పటివరకు 6,300 మందికి పైగా మరణించిన విషయం తెలిసిందే.