పట్టణ ప్రయాణికులకు శుభవార్త టౌన్ బస్ పాస్ నెలకు 500

మిర్యాలగూడ, జనం సాక్షి.పట్టణ పరిధిలోని పల్లె ప్రాంతాల నుండి ప్రతిరోజు టౌన్ కు వచ్చే వారికి వీలుగా టిఎస్ఆర్టిసి కొత్త పథకం ప్రవేశపెట్టింది.. మిరియాల పట్టణం నుండి చుట్టూరా ఐదు కిలోమీటర్ల లోపల గ్రామాల నుండి మిర్యాల పట్టణం – మిర్యాలగూడ పట్టణం నుండి గ్రామాలకు నెలరోజులపాటు అపరిమితంగా తిరిగేందుకుగాను రూ 500 తో టౌన్ బస్సు పాస్ పేరిట నూతన పథకాన్ని ప్రవేశపెట్టినట్లు మిర్యాలగూడ ఆర్టీసీ డిపో మేనేజర్ బొల్లెదు పాల్ తెలిపారు. ఈ పథకం ద్వారా పట్టణ పరిసర ప్రాంతాల్లో వ్యాపారస్తులు, ప్రైవేట్ ఉద్యోగస్తులు, రైతులకు, నిత్యం ఆటోలో ప్రయాణించే వారికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని ఆయన తెలిపారు