పట్టాభికి 27 వరకు రిమాండ్ పొడిగింపు
హైదరాబాద్: గాలి బెయిల్ ఫర్ సేల్ కుంభకోణంలో నిందితుడు మాజీ జడ్జి పట్టాభి రామారావుకు ఏసీబీ కోర్టు రిమాండ్ను పొడిగించింది. ఈ రోజు అధికారులు ఆయనను కోర్టులో హాజరుపరచగా ఈ నెల 27 వరకు రిమాండ్ను పొడిగిస్తోన్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులు రవిచంద్ర, జడ్జి చలపతిరావులకు కూడా ఈ నెల 27 వరకు రిమాండ్ను పొడింగించింది. అనంతరం పోలీసులు పట్టాభిని చర్లపల్లి జైలుకు తరలించారు.